Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 599 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 151 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.16 శాతం లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599 పాయింట్లు లాభపడి 73,088కి పెరిగింది. నిఫ్టీ 151 పాయింట్లు పుంజుకుని 22,147కి చేరుకుంది. ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు.. ఆ తర్వాత కొనుగోళ్ల జోరుతో లాభాల్లోకి మళ్లాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.72%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.46%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.39%), మారుతి (2.20%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.20%), నెస్లే ఇండియా (-1.04%), టీసీఎస్ (-0.93%), ఎల్ అండ్ టీ (-0.89%), టాటా మోటార్స్ (-0.84%).

More Telugu News